TG: రాజీవ్ యువవికాసం పథకానికి తెలంగాణ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు అధికారులు 3 నుంచి 15 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైతే శిక్షణ సంస్థలు అవసరమైన మద్దతు కూడా ఇవ్వనున్నాయి. ఈ పథకం అమలుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి.