రైతులు వేసవి దుక్కులను చేపట్టేందుకు సిద్ధమైతే లోతుగా, వాలుగు అడ్డంగా దున్నుకోవాలి. దీనివల్ల తొలకరి వాన నీరు భూమిలోకి ఇంకేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. భూమి నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, తేమగా ఉంటుంది. అలాగే వేసవి దుక్కులకు ముందు పొలంలో గొర్రెలు/పశువుల మందలను ఉంచడం వల్ల వాటి విసర్జక వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా భూమికి ఉపయోగపడతాయి. దీనివల్ల భూసారం పెరుగుతుంది.