UP: లఖ్నవూలో జరుగుతున్న 3 రోజుల మ్యాంగో ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. ఈ ప్రదర్శనలో రైతులు మోదీ, యోగి, అమిత్ షా, ములాయం, అఖిలేశ్ వంటి ప్రముఖుల పేర్లను మామిడిపండ్లకు పెట్టారు. ఇందులో 500 గ్రాములున్న మోదీ మామిడిని ఉపేంద్రకుమార్ సృష్టించగా, వెయ్యి గ్రాములున్న యోగి మామిడిని హాజీ కలీముల్లాఖాన్ సాగు చేసినది. రుచి, వాసనలో వైవిధ్యం ఉండటంతో వీటికి సూపర్ గిరాకీ లభిస్తోంది.