మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

65చూసినవారు
మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్‌ను తిరస్కరించింది. దీనిపై అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

సంబంధిత పోస్ట్