సుప్రీంకోర్టు చెట్ల నరికివేతపై సీరియస్గా హెచ్చరించింది. చెట్ల నరికివేతను సమర్థించవద్దని, పునరుద్ధరణ ప్రణాళిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ లేదని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూములపై విచారణలో అటవీ విధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేసి, పనులు నిలిపివేయాలని స్టే ఇచ్చింది.