మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషిపై "ఉగ్రవాదుల సోదరి" అని వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని విజయ్ షా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ సుప్రీంకోర్టు పిటిషన్ నిరాకరించింది. నిన్న యూపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్లోని మోవ్లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ షాపై కేసు నమోదైంది.