కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం సీఎం చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు అని వైఎస్ జగన్ అన్నారు. అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు కోర్టు గట్టిగా బుద్ధి చెప్పిందని ట్వీట్ చేశారు. 'పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. సాక్షి ఆఫీసులపై దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను కాలరాశారు' అని మండిపడ్డారు.