వలిగొండ మండలంలోని ముద్దాపురంలో లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సోలిపురం నర్సిరెడ్డి ఆదివారం పొలం పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గాయాలపాలైన అతడిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. SI యుగంధర్ వివరాలు వెల్లడించారు.