యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పద్మశాలి కాలనీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో నవ వధువు గాయత్రి (19) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగి నెల రోజులు అవుతుంది. నవ వధువు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు ఉన్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.