యాదాద్రి జిల్లా గుండాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు వివరాల ప్రకారం.. పెద్ద పడిశాల గ్రామానికి చెందిన గైగులరామక్క ఒక ఫంక్షన్ నిమిత్తం దేవరప్పులకు ట్రాక్టర్లో వెళ్తుంది. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో వృద్ధురాలు కిందపడి స్పాట్లోనే మృతి చెందింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.