గ్రామీణ హమాలీ కూలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోష పతి అన్నారు. మంగళవారం హుజూర్నగర్ లో గ్రామీణ హమాలీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి నాయకుడు గుండె బోయిన వెంకన్న, యాదవ్ హమాలి యూనియన్ నాయకులు శంభయ, మట్టయ్య, రామయ్య, వెంకటేశ్వర్లు, సైదులు వీరయ్య పాల్గొన్నారు.