ధ్యానం తో మానసిక ప్రశాంతత లభిస్తుందని హార్ట్ ఫుల్ నెస్ సెంటర్ జోనల్ కో ఆర్డినేటర్ సీహెచ్ వరప్రసాద్, డా. రామారావులు అన్నారు. శనివారం హుజూర్ నగర్ లో ధ్యానం యోగపై ఉచిత శిక్షణ నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు ధ్యానం, యోగా చేయడం వల్లన తేలికదనం అనుభూతి చెందుతారన్నారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగి మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారన్నారు. కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యులు ఉన్నారు.