మతసామరస్యానికి ప్రతీక మొహరం పండుగని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. ఆదివారం హుజూర్నగర్ లో మొహరం పండుగ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల విశ్వాసానికి పీర్ల పండుగ ప్రతీకగా నిలిచిందన్నారు. మొహరం పండుగ నిరసన దినాలైనప్పటికీ అమరుల త్యాగాలు, నిబద్ధతకు, ధైర్య సాహసాలకు మార్గదర్శకమన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఉన్నారు.