నేరేడుచర్ల లోని గ్రంథాలయం వీధిలో గూండా చంద్రకళ ఇంటికి గుర్తు తెలియని మహిళ వచ్చి మంచి నీళ్ళు కావాలని అడిగింది. చంద్ర కళ గ్లాసు లో మంచి నీళ్ళు ఇవ్వగా మంచి నీళ్ళు తాగుతూ కళ్ళలో కారం కొట్టి మెడలోని 2 తులాల బంగారు పుస్తెలతాడు దొంగిలించింది. కాగా బాధితురాలు గురువారం స్థానిక పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది. కాగా స్పందించిన పోలీసులు 24 గంటల్లో నిందితురాలిని పట్టుకొని రిమాండ్ కు తరలించారు.