కోదాడ: బ్రహ్మకుమారి మఠంలో క్యాలెండర్ ఆవిష్కరణ

80చూసినవారు
కోదాడ: బ్రహ్మకుమారి మఠంలో క్యాలెండర్ ఆవిష్కరణ
ఆధ్యాత్మిక చింతనకు బ్రహ్మకుమారీస్ ప్రతీకగా నిలుస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి అన్నారు. గురువారం హుజూర్నగర్ పట్టణంలో బ్రహ్మకుమారిస్ మఠంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సదస్సులో ఆయన మాట్లాడారు. వేగవంతమైన నేటి సమాజంలో ఒత్తిడిలను జయించేందుకు ఈ సంస్థ నియమాలు ఎంతో ఉపయోగపడతాయి అన్నారు. అనంతరం బ్రహ్మకుమారిస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్