లారీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన జరిగింది గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో27 ప్రయాణికులకు ఉండగా 8 మందికి గాయాలయ్యాయి. సీఐ చరమంద రాజు స్థానిక ఎస్సై సైదులు స్థానికులతో కలిసి గాయపడిన వారందరిని 108 లో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని మెరుగైన వైద్యం కొరకు సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు