చింతలపాలెం మండలంలోని గుడిమల్కాపురం గ్రామంలో పతాంజలి ఆయిల్ పామ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి ప్రదీప్తి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయడం వలన అధిక లాభాలు వస్తాయని తెలిపారు. సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం మరియు ఎరువుల యాజమాన్యాన్ని, ప్రభుత్వం ద్వారా ఆయిల్ పామ్ తోటలకు అందించే రాయితీలు వివరించారు.