చింతలపాలెంలో భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు

55చూసినవారు
చింతలపాలెంలో భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు
ఆపరేషన్ సిందూర్ 2.0లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైనికుల మనోబలాన్ని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చింతలపాలెం మండల కేంద్రంలోని శ్రీ ఉమామహేశ్వర ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మన దేశ సైనికులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దేశం కోసం ధైర్యంగా పోరాడుతారని, వారి పోరాటం వల్లే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్