హుజూర్‌నగర్‌లో ప్రాణం తీసిన ఈత సరదా

53చూసినవారు
హుజూర్‌నగర్‌లో ప్రాణం తీసిన ఈత సరదా
బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 8 మంది గొర్రెలు కాపరులు గొర్ల మేత మేపేందుకు హుజూర్ నగర్ ప్రాంతం వచ్చారని తెలిపారు. మక్తల్ మండలం గుడిమండ్ల గ్రామానికి చెందిన కనుమనూరు శేఖర్ (14) తోపాటు చందాపురం గ్రామానికి చెందిన మోదీపురం లక్ష్మణ్ (21) శుక్రవారం ఉదయం హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువు సమీపంలోని ఈత కొట్టేందుకు బావిలోకి దిగి మునిగి మృతి చెందారు.

సంబంధిత పోస్ట్