విద్యార్థుల్లో వృత్తి విద్యా నైపుణ్యాల పెంపుకు ఉపాధ్యాయురాలు శకుంతల చేసిన కృషి అభినందనీయం అని నడిగూడెం హైస్కూల్ హెచ్ ఎమ్ ముశ్రం శ్రీనివాస్ అన్నారు. బుధవారం పాఠశాల నుండి ఉద్యోగ విరమణ చేసిన శకుంతల అభినందన సభ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఉపాధ్యాయులు సామినేని శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, బత్తిని శ్రీనివాసరావు, శోభన్ బాబు శ్రీదేవి, మిరాజుద్దీన్, మౌలానా, అశోక్ కత్తి వెంకటేశ్వర్లు ఉన్నారు.