లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య అధికారి కోటా చలం అన్నారు. శనివారం చివ్వేంల మండలం ఎంజి తండాకు చెందిన సుహాసిని మృతి ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. కోదాడ పట్టణంలోని విజయ హాస్పిటల్ లో స్కానింగ్ తీసినట్లు గా గుర్తించి హాస్పిటల్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని హాస్పిటల్ సీజ్ చేసారు.