కోదాడ పట్టణంలోని ఎరువుల, విత్తనాల దుకాణాలను, తమ్మర సహకార సంఘంలో విత్తనాల, ఎరువుల నిల్వలను జిల్లా వ్యవసాయ అధికారి శుక్రవారం తనిఖీ చేసారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మాలన్నారు. ఎరువులు కొన్న రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ కి అమ్మకూడదని సూచించారు. సీజన్ ప్రారంభం అయినందున రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రజని అన్నారు.