మునగాల మండలం ముకుందాపురంలోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నకిరికంటి అగస్త్య పుట్టినరోజు సందర్భంగా వృద్దులకు అల్పాహారం, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు విజయమ్మ మాట్లాడుతూ.. దాతలు సత్యకిరణ్ అర్చన దంపతులను అభినందించారు. అగస్త్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు ఎస్ ఎస్ రావు, సిబ్బంది, జ్యోతి, రాధ పాల్గొన్నారు.