గంజాయి ఇతర మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో నిరోధించడానికి పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నానికి విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ సహకారం ఇవ్వాలని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ డిఎస్పీ కార్యాలయంలో కోదాడలోని జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్స్ తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.