ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేసి అర్హులైన పేదలకు సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా అందించాలని సామజిక ఉద్యమ కర్త సయ్యద్ బషీరోద్దీన్ బుధవారం ఒక ప్రకటన లో కోరారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా నేటివరకు ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయక పోవడం బాధాకరం అన్నారు. రేషన్ కార్డుతో నే 6 గ్యారెంటీ లు ముడి పడి ఉన్నాయని తెలిపారు.