
ఆపరేషన్ సిందూర్లో హతమైన ఉగ్రవాదుల పేర్లు వెల్లడి
మే 7న తెల్లవారుజామున భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరంపై జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల వివరాలను భారత్ ప్రకటించింది. ఈ దాడిలో మసూద్ అజార్కు సంబంధించిన ఇద్దరు బావమరుదులు హఫీజ్ మహ్మద్ జమీల్, మహ్మద్ యూసఫ్ అజార్తో పాటు ముదస్సర్ ఖదియాన్ ఖాస్, ఖలీద్ అలియాస్ అబు అకాసా, జైషే మహ్మద్కు చెందిన మహ్మద్ హసన్ ఖాన్ అనే ఉగ్రవాదులు చనిపోయారని వెల్లడించింది.