
పాకిస్తాన్ కాల్పుల్లో సరిహద్దు గ్రామంలో ధ్వంసమైన ఇళ్లు(వీడియో)
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా అజోట్ గ్రామంలో గురువారం రాత్రి పాకిస్తాన్ జరిపిన కాల్పులు కారణంగా అనేక ఇళ్లకు నష్టం వాటిల్లింది. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని భారత సైనిక స్థావరాలను మిస్సైళ్లతో, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనల నేపథ్యంలో భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో గగనతల నిఘాను మరింత పెంచింది.