
నేడే ఇంటర్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా
AP: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉ.11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్సైట్తో పాటు మన మిత్ర వాట్సప్ యాప్లోనూ పొందవచ్చు. వాట్సప్ నంబర్ 95523 00009కు ‘HI’ అని మెసేజ్ చేసి ఫలితాలు అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అవసరమైన సమాచారాన్ని అందిస్తే పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తాయి.