కోదాడ: ధాన్యం కొనుగోళ్లు పూర్తి

68చూసినవారు
కోదాడ: ధాన్యం కొనుగోళ్లు పూర్తి
కోదాడ పీఏసీఎస్ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 715 మంది రైతుల నుండి 52, 550 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వానకాలంలో సన్న రకం ధాన్యం విక్రయించిన రైతులందరికీ 500 బోనస్ చెల్లించడం జరిగిందని తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి అయినందున కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి చేసామన్నారు.

సంబంధిత పోస్ట్