రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి శనివారం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు కోదాడ కాశీనాథం ఫంక్షన్ హాల్ లో సోషల్ మీడియా సోల్జర్స్ సదస్సులో ఆయన పాల్గొంటారు. తిరిగి 12 గంటలకు కోదాడ నుండి చిలుకూరు మండలం బేతవోలులో ఒక కార్యక్రమంలో పాల్గొని అనంతరం హుజూర్నగర్ సోషల్ మీడియా సదస్సుకు హాజరవుతారు.