కోదాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఐ తుమ్మేపల్లి రఘు రాధిక ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పులిహోర మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం అభినందనీయం అనివాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాస రావు మాట్లాడుతూ 250 మందికి పైగా పులిహోర, మజ్జిగ పంపిణీ చేశామని అందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.