విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. శనివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో బాసర త్రిబుల్ ఐటీ సీట్లు సాధించిన తాళ్లూరి రేఖ శ్రీ, కే నరేందర్ లను సన్మానించి మాట్లాడారు. ఒకే పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు సీట్లు సాధించడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం మార్కండేయ, ఉపాధ్యాయులు ఉన్నారు.