కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి సూక్ష్మవస్తులపై అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బుధవారం హాస్యనటుడు చార్లెస్ చాప్లిన్, స్వాతంత్ర సమరయోధుడు కందుకూరి వీరేశం పంతులు ల జయంతి సందర్భంగా వారి ప్రతిమలు అంగుళం సుద్ద ముక్కపై ఆవిష్కరించి కళాత్మకతతో వారి పైతన అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యం, పప్పు గింజలు , పెన్సిల్ మొన లపై పలు కళాఖండాలు ఆవిష్కరించాడు.