పేదలకోసం చేసే సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకార అందిస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. ఆదివారం కోదాడ లో కత్రం ఛారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి, అభిజ్ఞా రెడ్డిలు ఏర్పాటు చేసిన కత్రం ఉచిత ఆరోగ్య సేవా వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలనే అలోచన రావడం ప్రశంసనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్ రావు తదితరులు ఉన్నారు.