మునగాల మండలంలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఎస్ విద్యాసంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి రెడ్డి కోరారు. గత ఆరు నెలల కాలం నుంచి మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గంజాయి నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందన్నారు.