కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు శుక్రవారం జాతీయ పతాక రూప కర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై వెంకయ్య ప్రతిమను చెక్కి ఆయనపై తనకుఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్క , లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, సీని కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బురపరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని పలువురు అభినందించారు.