గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించడం సరైన ఫలితాలను ఇవ్వలేదని, పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొని విద్యార్థులు ఉపయోగించుకోవడానికి ఇబ్బందిగా ఉండేదని బంధం వెంకటేశ్వర్లు తెలిపారు. కావున నూతన ప్రభుత్వం వెంటనే ప్రతి పాఠశాలకు స్కావెంజర్ పోస్ట్ ను కేటాయించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.