ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టిన అంబులెన్స్

67చూసినవారు
మిర్యాలగూడ మండలం గూడూరు సమీపం వద్ద ఆగి ఉన్న టిప్పర్ ను అంబులెన్స్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరులోని తన బంధువులు కుటుంబంలో శుభకార్యానికి వెళ్లి కిడ్నీల సమస్యతో అనారోగ్యానికి గురికావడంతో అంబులెన్స్ ద్వారా హైదరాబాదుకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కిడ్నీ పేషెంట్ సునీతతో పాటు వారి బంధువులైన శివరామకృష్ణ, సుబ్బమ్మ, సునీల్ లకు స్వల్ప గాయాలు కావడంతో వేరొక అంబులెన్స్ ద్వారా హైదరాబాదుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్