నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. భర్త మరణించిన విషయాన్ని తట్టుకోలేక భార్య లచ్చమ్మ తీవ్రంగా రోదిస్తూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. భార్యా భర్తలు ఒక రోజు తేడాలో చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.