మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డికి, కాంగ్రెస్కు మధ్య దూరం పెరుగుతోందన్న చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో రాజగోపాల్ అలకబూనినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమచాారం. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే HYDలో సభ పెట్టినా రాజగోపాల్ పట్టించుకోకపోవడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.