నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన యంపల్లి నరేష్ (30) సెంట్రింగ్ పనిచేస్తూ నల్గొండలోని ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. మునుగోడు మండలం సింగారం గ్రామంలో జరిగే శుభకార్యానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గూడపూర్ సమీపంలో వాహనం, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఘటనలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.