చిట్యాల మండలం ఎలికట్ట గ్రామంలో కడుపునొప్పి భరించలేక యువకుడు పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మత్స్యగిరి (22) ఉదయం పొలం వద్ద పురుగు మందు తాగగా, ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.