నార్కట్ పల్లి మండలం పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామ శివారులోని ఉదయ సముద్రం ఎత్తి పోతల పథకం ప్రాజెక్టులోకి నీటిని ఒకటవ మోటర్ ద్వార విడుదల చేసినట్లు శుక్రవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలో భూములు ఉన్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిండటం వలన చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి తగిన సాగునీరు అందుతుందని వారు అంటున్నారు.