పాము కాటుకు గురై చిన్నారి మృతి

67చూసినవారు
పాము కాటుకు గురై చిన్నారి మృతి
చందంపేట మండలం పొగిళ్లలో శనివారం పాముకాటుకు గురై చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన కరెంటు కిషన్ నాయక్-గంగా దంపతుల కుమార్తె పవిత్ర ( 5) బాత్రూంకు వెళ్ళగా పాముకాటుకు గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స కోసం దేవరకొండ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్