నల్గొండ పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరం గీతాంజలి కాంప్లెక్స్ మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్ ను శుక్రవారం రాత్రి 11: 30కు గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడు సురేష్ తప్పించుకునే ప్రయత్నం చేసిన వదలకుండా అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి డీఎస్పీ శివరాం రెడ్డి చేరుకొని విచారణ చేపట్టారు.