నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగతుర్తి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాణి (29) తన నెలల వయసున్న కుమార్తెతో కలిసి బావిలో దూచి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.