ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేతన్న చేయూత పథకం నిలిచిపోయింది. దీంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు వచ్చే కూలీ డబ్బులు నెలకు 8 శాతాన్ని బ్యాంకులో మూడేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేయాలని.. అలాగే దానికి రెట్టింపు డబ్బును వారి ఖాతాలో జమ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లాలో ఈ పథకంలో 16,799 మంది చేనేత కార్మికులు చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయూత కోసం నేతన్నలు ఎదురుచూస్తున్నారు.