SRPT: మోతే మండలం రఘవపురం గ్రామ శివారులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ మిల్లును సీజ్ చేయాలని సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే ఎమ్మర్వో కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.