ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించిన బిజెపి నాయకులు

2870చూసినవారు
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని శనివారం పుననః ప్రారంభించారు. ఈసందర్భంగా సూర్యాపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్స్ లో నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఎల్ ఈ డి స్క్రీన్ ల ద్వారా రైతులు, బిజెపి నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
దేశ రైతాంగం కోసం రామగుండంలో 6300 కోట్లతో భారత ప్రభుత్వం నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని పున: ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు దేశంలో రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎరువుల పరిశ్రమలు కాలక్రమేనా మూతపడిన రైతుల గురించి ఆలోచించి ఎరువుల పరిశ్రమలను తెరవాలని ఆలోచించలేదు కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక మూతబడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తున్నారు అని అన్నారు.

ట్యాగ్స్ :