మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపై, తల్లిదండ్రులపై చర్యలు తప్పవని జిల్లాఎస్పీ నర్సింహ హెచ్చరించారు. శనివారం సూర్యాపేట పరిధిలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ 73 మంది మైనర్ల తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వాహనాల చట్టాన్ని వివరించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలోడిఎస్పి పార్థసారథి ఉన్నారు